మూడవసారి ప్రధానిగా మోదీ తొలి సంతకం దీనిపైనే..
ముచ్చటగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ప్రధాని నరేంద్రమోదీ. ఆయన మూడవసారి ప్రధానిగా తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధికి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. సౌత్ బ్లాక్లోని పీఎం కార్యాలయం నుండి ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం రైతుల ఖాతాలలో రూ. 20 వేల కోట్లు ఆర్థిక సహాయం విడుదల చేస్తూ సంతకం చేశారు.