‘పుష్ప’లో ఐటెం సాంగ్ చేయొద్దన్నారు
తన విడాకుల విషయంలో చాలాకాలం తర్వాత నోరు విప్పారు స్టార్ హీరోయిన్ సమంత. తాను వైవాహిక బంధంలో చాలా నిజాయితీగా ఉన్నానని, అయినా అది వర్కవుట్ అవలేదని బాధపడ్డారు. ‘మయోసైటిస్’ వ్యాధి నుండి కోలుకుని, ఈ మధ్యనే ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్న సమంత ఒక ఇంటర్యూలో తన వ్యక్తిగత జీవితం గురించిన విషయాలు బోల్డ్గా వివరించింది.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/03/image-424.png)
తాను రెండేళ్లుగా విడాకుల అనంతరం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, తన విడాకుల వల్ల ఎంతో మంది తనను ట్రోల్స్ చేశారని పేర్కొన్నారు. తనకు పాన్ ఇండియా ఖ్యాతి తెచ్చిపెట్టిన పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా’ పాటను ఒప్పుకోవద్దని తనకు ఎంతోమంది చెప్పారన్నారు. తాను విడాకులు ప్రకటించిన అనంతరం ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ చేయడం మంచిది కాదని తన శ్రేయోభిలాషులు కూడా చెప్పారన్నారు. కానీ తాను ఏతప్పూ చేయలేదని, ఎందుకు ఇంట్లో కూర్చోవాలనే ఉద్దేశ్యంతోనే తాను ఆపాటను ఒప్పుకున్నానని తెలియజేసింది. తాను ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉన్నానని, మెంటల్గా, ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా బలంగా ఉన్నానని ధైర్యంగా చెప్పింది సమంత.