Home Page SliderTelangana

నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ విజేతలు వీరే..

Share with

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా- ఆర్మూర్ నుండి బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గెలుపొందారు.

బీజేపీ తరపున నిజామాబాద్ అర్బన్ నుండి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా గెలుపొందారు.

బీజేపీ తరపున కామారెడ్డి నుండి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయకేతనం ఎగురవేశారు.

బీఆర్ఎస్ సిట్టింగ్‌లైన బాన్సువాడ నుండి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు.

బీఆర్ఎస్ సిట్టింగ్‌లైన బాల్కొండ నుండి వేముల ప్రశాంత్‌రెడ్డి గెలుపొందారు.

జుక్కల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే మొదటి నుండి ఆధిక్యంలో కొనసాగినప్పటికీ చివరి రౌండ్‌కు వచ్చేవరకు ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు స్వల్ప ఆధిక్యంలో గెలుపొందారు.

నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డిల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డాక్టర్ భూపతిరెడ్డి, మదన్‌మోహన్‌రావులు మొదటి నుండి ఆధిక్యంలో కొనసాగుతూనే వచ్చారు. వీరిద్దరూ భారీ తేడాతో గెలుపొందారు.

నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ బీజేపీ అభ్యర్థులు సైతం మొదటి నుండి స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో నిలుస్తూ వచ్చారు. వీళ్లు భారీ మెజారిటీతో గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థులు ద్వితీయ స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు.

ఇక బాన్సువాడ నుండి బీఆర్ఎస్ సిట్టింగ్ పోచారం సైతం ఆది నుండి పూర్తి ఆధిక్యంతో వచ్చి చివరికి మంచి మెజారిటీతో విజయం సాధించారు.