NewsTelangana

మునుగోడులో కేటీఆర్ భారీగా ట్రాఫిక్ జామ్

Share with

మునుగోడు ఉపఎన్నికలలో భాగంగా ఈ రోజు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. దీంతో మునుగోడులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేటీఆర్ రాకతో మునుగడులో పండుగ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పూల బోకేలు,టపాసులతో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా డ్రోన్ సహయంతో కేటీఆర్‌పై పూల వర్షం కూడా కురిపించారు. ప్రజల చూపించిన అభిమానానికి కేటీఆర్ కూడా కారు దిగి వారితో కలిసి అడుగులు వేశారు. కొండంత అభిమానం చూపించినందుకు కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.