Home Page SliderTelangana

‘ఎన్నికల హామీలు తీర్చాల్సిన అవసరం లేదన్న’ కర్ణాటక సీఎం..తెలంగాణ భవిష్యత్తు కూడా ఇంతేనన్న కేటీఆర్

Share with

‘ఓట్ల కోసం ఎన్నో మాటలు ఇస్తాం. ఎన్నికలలో గెలుపు కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేం కదా.. అన్నీ ఉచితంగా ఇవ్వలేమంటూ’ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ ఫైరయ్యారు. ‘రేపు తెలంగాణ భవిష్యత్తు కూడా ఇంతేనా’? అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘ఎన్నికల వాగ్దానాలు ఇచ్చేముందు డబ్బు ఉందా, లేదా చూసుకోలేదా?’ అంటూ మండిపడ్డారు. వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బు లేదని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందువెనుకలు చూసుకోకుండా ప్రజలకు అబద్దపు హామీలను ఇచ్చి, ఓట్లు వేయించుకుందని, రాబోయే కాలంలో తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు తన మాటలపై వస్తున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఖండించారు. తనపై బీజేపీ నేతలు దుష్ప్రచారం  చేస్తున్నారని, తాను అసెంబ్లీలలో అలా మాట్లాడలేదని పేర్కొన్నారు.