కూతురిని ప్రేమించాడని మేనమామ ఘాతుకం
తన కూతురిని ప్రేమించాడనే కారణంతో మేనల్లుడికి విషమిచ్చి చంపేశాడో మేనమామ. చికిత్స పొందుతూ మేనల్లుడు అనిల్ మరణించాడు. మంచిర్యాలలోని దండేపల్లి మండలం గూడెంలో ఈ దారుణం జరిగింది. చనిపోయేముందు అనిల్ వాగ్మూలం ఇచ్చారు. కుమార్తెను ప్రేమించాడని కక్ష పెంచుకున్న అనిల్ మేనమామ నీతో మాట్లాడాలి రమ్మని కబురుపెట్టి ఒకచోటికి రప్పించి బీరులో విషం కలిపి ఇచ్చాడు. దీనితో తెలియక తాగిన అనిల్ అపస్మారక స్థితిలో చేరుకుని ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ పరిస్థితి వికటించి మరణించాడు అనిల్. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.