Andhra PradeshHome Page Slider

నిజం గెలవాలి మొదలైంది..

Share with

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమైంది. చంద్రగిరిలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

చంద్రగిరి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర నేడు ప్రారంభమైంది. నారావారిపల్లెలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శించడం మొదలైంది. తొలిరోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. రూ.3 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ధైర్యంగా ఉండాలని.. కుటుంబానికి తామంతా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. కాసేపట్లో నేండ్రగుంట చేరుకుని మృతి చెందిన తెదేపా కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వారానికి ముడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుందని చెప్పారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొననున్నారు.