Home Page SliderNational

రాహుల్‌ కేసు విచారణ ఈ నెల 13కు వాయిదా

Share with

పరువు నష్టం కేసులో తనకు పడిన రెండేళ్ల శిక్షను రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో ఈ రోజు పిటిషన్ వేశారు. దీనిపై రాహుల్‌కు 15 వేల పూచీకత్తుపై బెయిల్ లభించింది. కానీ దిగువ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13 వతేదీకి వాయిదా వేసింది. ఈ తేదీకి రాహుల్ రావాల్సిన అవసరం లేదు. మే 3 నాటికి కేసు పూర్తి కావచ్చని భావిస్తున్నారు. పూర్తి బస్సుతో కాంగ్రెస్ నాయకులతో, సోదరి ప్రియాంకతో కలిసి కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఈ న్యాయపోరాటంలో రాహుల్‌కు అండగా ఉంటామనే సందేశంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా కలిసి వచ్చారు.