Home Page SliderNational

గాలి జనార్థన్ రెడ్డికి షాక్ ఇచ్చిన  సుప్రీంకోర్టు

Share with

గాలి జనార్థన్ రెడ్డి గత కొంతకాలంగా అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. కాగా గాలి జనార్థన్ రెడ్డి ఈ ఏడాది కర్ణాటక ఎన్నికల్లో పోటి చేస్తానని ప్రకటించి..కొత్త పార్టీని కూడా స్థాపించారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున బళ్లారికి వెళ్లేందుకు అనుగుణంగా బెయిల్ నిబంధనలు సడలించాలని ఆయన సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఎన్నికల తర్వాత నిబంధనల సడలింపులపై మరోసారి కోర్టుకు వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా ఆయన ఇప్పుడు వేసిన పిటిషన్‌ను మాత్రం కొట్టివేసినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.