సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలంక కెప్టెన్
శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన న్యూజిల్యాండ్ vs శ్రీలంక మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓటమిపాలయ్యింది.దీంతో శ్రీలంక టెస్ట్ కెప్టెన్ కరుణరత్నే తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఐర్లాండ్తో 2 టెస్టుల సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 28 ) అనంతరం కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా ఈ విషయాన్ని ఆయన శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలిపారు. అయితే 2019లో శ్రీలంక జట్టు టెస్ట్ కెప్టెన్సీ చేపట్టిన కరుణరత్నే తొలి సిరీస్లోనే సౌతాఫ్రికాపై చారిత్రక విజయం సాధించారు.