Home Page SliderTelangana

రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి లక్ష్యం రూ.18,500 కోట్లు

Share with

హైదరాబాద్: ఖజానాకు కీలక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం రూ.18,500 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్దేశించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ చేపట్టింది. ఆగస్టు 1వ తేదీ నుండి కొత్త ధరలను అమల్లోకి తేవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది.