News

తెలంగాణాలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

Share with

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణా పర్యటన నేటితో ముగిసింది. కాగా శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము గత 5 రోజుల క్రితం తెలంగాణాకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజుతో పర్యటన ముగియడంతో ఆమె దుండిగల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెకు తెలంగాణా గవర్నర్ తమిళిసై,సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు. అయితే ఈ 5 రోజులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె పోచంపల్లిలో చేనేత కార్మికుల కష్టాలను స్వయంగా వారి వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. కాగా వారి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేనేత కార్మికులకు హామీ ఇచ్చారు.