Home Page SliderTelangana

కొలువుతీరిన కొత్త ప్రభుత్వం… ప్రమాణ స్వీకారంతో శ్రీకారం

Share with

‘రేవంత్ రెడ్డి అనే నేను’ అంటూ రేవంత్ ప్రమాణం చేయడం మొదలు పెట్టగానే నినాదాలు మిన్నంటాయి. నేడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి, మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో శాసన పరమైన ప్రమాణం చేయించారు.

కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కార్యకర్తలు సాదరంగా పూల రథంలో వేదికపై తీసుకువచ్చారు. గవర్నర్ తమిళిసై ఆగమనం అనంతరం జాతీయ గీతంతో ఈ కార్యక్రమం మొదలయ్యింది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్కచే ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తామని, ప్రలోభాలకు గురి కాబోమంటూ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం ఉత్తమ కుమార్ రెడ్డి ప్రమాణం చేశారు. భయం, రాగద్వేషాలకు అతీతంగా తన మంత్రి పాత్ర నిర్వహిస్తానని ప్రమాణం చేశారు. అనంతరం ఎంపికైన ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు కొనసాగాయి.