Home Page SliderNational

లోక్‌సభలో జైపాలస్తీనా నినాదం చేసిన ఎంపీ

Share with

లోక్‌సభలో నేడు కూడా ఎంపీల ప్రమాణ స్వీకారాలు కొనసాగాయి. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ నినాదాలు లోక్‌సభలో దుమారం రేపాయి. ప్రమాణ స్వీకారం అనంతరం జైభీమ్, జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు. దీనిపై అధికార పక్ష నేతలు మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో అసద్ వ్యాఖ్యలను రికార్డు నుండి తొలగించారు స్పీకర్. నేడు తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు. వీరు తెలుగులో తమ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. తెలంగాణ రాష్ట్రం నుండి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు.