Home Page SliderPoliticsTelangana

ప్రభుత్వం నా ఐ ఫోన్‌ను హ్యాక్‌ చేస్తోంది…

Share with

తన ఐ ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం హ్యాక్‌ చేస్తోందంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా ఆరోపించారు. తన ఫోన్‌  హ్యాక్‌ అవుతోందంటూ.. యాపిల్‌ సంస్థ నుంచి మెయిల్‌ వచ్చిందన్నారు. ఆ మెయిల్‌ను కూడా ట్విట్టర్‌లో జత చేశారు. ప్రభుత్వ సహకారం లేకుండా ఐ ఫోన్లను హ్యాక్‌ చేయలేరని యాపిల్‌ సంస్థ వెల్లడించిందన్నారు. దీంతో ఆయన ఆగకుండా ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. ‘మీలా నా ఐ ఫోన్‌ను ధ్వంసం చేయను. కానీ మీ దోపిడీ- చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా’ అని ట్విట్టర్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ రాజకీయ పార్టీల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ప్రముఖుల ఐ ఫోన్లు హ్యాక్‌ అవుతున్నట్లు యాపిల్‌ కంపెనీ హెచ్చరించింది.