NewsTelangana

నా రాజీనామాతోనే మునుగోడు అభివృద్ది మొదలైంది

Share with

మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాలరెడ్డి ఈ రోజు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ప్రసంగిస్తూ..కేసీఆర్ తన బొంద తానే తోడుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలనలో లిక్కర్‌తో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఉద్యమ ద్రోహులంతా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. తన రాజీనామాతోనే తెలంగాణా ప్రభుత్వం దిగొస్తుందని కాబట్టే రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణాలో అభివృద్ది అంటే సిద్ధిపేట, గజ్వేల్ ,సిరిసిల్లేనా? అని రాజగోపాల్ రెడ్డి కేసీఆర్‌ని ప్రశ్నించారు. ప్రజాగొంతుక వినిపిస్తున్నానని అసెంబ్లీలో నా గొంతు నొక్కేశారన్నారు. అలాంటి వారికి ప్రజలు ఖచ్చింతంగా బుద్ది చెప్పాలన్నారు. ఈ మేరకు మునుగోడు ఉపఎన్నికలలో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ విధంగా మునుగోడు ఉపఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి.