Home Page SliderTelangana

“సింగరేణికి మంచి చేయడానికే కేంద్రం పనిచేస్తోంది”..కేంద్రమంత్రి

Share with

సింగరేణికి మంచి చేయడానికే కేంద్రం గనుల వేలంపాటలు నిర్వహిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని విమర్శించేవారికి మర్యాద ఉండదన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నడూ సింగరేణికి లాభం చేకూర్చే పని చేయలేదని విమర్శించారు. సింగరేణి కార్మికులకు ఇళ్లిస్తామని మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. వారికి వైద్య సదుపాయం, కార్మికుల రెగ్యులరైజ్ వంటి పనులేవీ నెరవేర్చలేదన్నారు. సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత 49 శాతం ఉన్న కేంద్రప్రభుత్వానికి కూడా ఉందన్నారు. తెలంగాణ బిడ్డగా సింగరేణి ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. సింగరేణికి సంబంధించిన అన్ని అంశాలపై సమీక్ష నిర్వహిస్తాను. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.2 వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. ఓడిపోయామనే బాధలో కేటీఆర్ ఇస్టానుసారం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.