National

పెళ్లిరోజే ఆగిన వధువు గుండె..అయినా జరిగిన పెళ్లి

Share with

మరికొన్ని గంటల్లోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు అర్ధాంతరంగా తనువు చాలించింది. పెళ్లి ముహుర్తం దగ్గర పడుతున్న వేళ ఆ వధువు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోపక్క వరుడు కళ్యాణమండపానికి చేరుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ కుటుంబం ఓ అనుహ్య నిర్ణయం తీసుకొంది. మృతి చెందిన వధువు స్థానంలో ఆమె చెల్లినిచ్చి వివాహం చేయించింది.  అయితే ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. భావ్‌నగర్ జిల్లా సుభాష్ నగర్‌కు చెందిన జినాభాయ్ రాథోడ్ పెద్ద కుమార్తె హేతల్‌కు నారీ గ్రామానికి చెందిన విశాల్ భాయ్‌తో గత రెండు రోజుల క్రితం వివాహం జరగాల్సివుంది. కాగా వరుడు ఆ రోజు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. అంతలోనే వధువు ఒక్కసారిగా స్పృహ కోల్పోయంది. దీంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హస్పటల్‌కు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించిందని తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే వధువు కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వధువు స్థానంలో ఆమె చెల్లెలినిచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. దీనికి వరుడి కుటుంబ సభ్యులు  కూడా అంగీకరించారు.