బీజేపీ ఈవీఎంలు హ్యాక్ చేయబోతోంది..మమతా బెనర్జీ
రాబోయే లోక్సభ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఈవీఎంలను హ్యాక్ చేయాలనే ప్రయత్నాలు చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. తనవద్ద ఈ విషయంలో ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. విపత్తులు, మతపరమైన ఉద్రిక్తతలు, నిరుద్యోగం నుండి విపక్షాల కూటమి INDIA మాత్రమే దేశాన్ని కాపాడగలదని ఆమె నేడు మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికలలో ఈ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ఎన్నికలలో గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతుందని వ్యాఖ్యానించారు మమతా బెనర్జీ.