Home Page SliderNational

బీజేపీ ఈవీఎంలు హ్యాక్ చేయబోతోంది..మమతా బెనర్జీ

Share with

రాబోయే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఈవీఎంలను హ్యాక్ చేయాలనే ప్రయత్నాలు చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. తనవద్ద ఈ విషయంలో ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. విపత్తులు, మతపరమైన ఉద్రిక్తతలు, నిరుద్యోగం నుండి విపక్షాల కూటమి INDIA మాత్రమే దేశాన్ని కాపాడగలదని ఆమె నేడు మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఈ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ఎన్నికలలో గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతుందని వ్యాఖ్యానించారు మమతా బెనర్జీ.