Home Page SliderNational

సీఎంల ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోని బీజేపీ ప్రభుత్వం

Share with

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వారం అయినా కూడా ముఖ్యమంత్రిని ఎంపిక చేయలేకపోతున్నారని రాజస్థాన్ కేర్‌టేకర్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎంను డిసైడ్ చేయడంలో ఇంత ఆలస్యం చేసి ఉంటే బీజేపీ నేతలు తమపై అరుపులు, కేకలు పెట్టేవారని గెహ్లాట్ విమర్శించారు. ఎన్నికల్లో గెలిచి వారం దాటినా ఇప్పటికీ కొత్త ముఖ్యమంత్రి పీఠం ఎక్కలేదు. బీజేపీలో క్రమశిక్షణ లేదు. వారం రోజులు కావస్తున్నా మూడు రాష్ట్రాల్లో ఇంతవరకు ముఖ్యమంత్రులను ఎంపిక చేయలేదు.