Andhra PradeshHome Page Slider

శ్రీశైలం- దోర్నాల ఘాట్ రోడ్డులో ప్రమాదం..భారీగా ట్రాఫిక్ జామ్

Share with

శ్రీశైలం- దోర్నాల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. దీనితో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దోర్నాల మండలం తుమ్మల బైలు చెంచుగూడెం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సును  టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో లోని పలువురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు. వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనితో సుమారు 2 గంటల పాటు  ఆ మార్గంలో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. దీనితో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.