Home Page SliderTelangana

హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తెలంగాణాకే మణిహారం

Share with

హైదరాబాద్ నగరంలో దేశ రాజ్యాంగ నిర్మాత, భావి భారత స్ఫూర్తిప్రదాత బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. కాగా ఈ విగ్రహ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విగ్రహాన్ని ఆవిష్కరించనుంది.

అంబేద్కర్ భారీ విగ్రహం నిర్మాణం పనులను రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజిపి అంజనీ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాహుల్ బొజ్జ, ఆర్ అండ్ బి అధికారులు పరిశీలించారు. కాగా విగ్రహావిష్కరణకు సంబంధించిన తుది మెరుగులు దిద్దుతూ చివరి దశ పనులు చకాచకా చేస్తున్నారు.


అయితే ఇది హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. ఇకపై తెలంగాణకే మణిహారంగా నిలవనుంది. ఈ అంబేద్కర్ విగ్రహం.. ఎడమ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని.. కుడి చేతిని ముందుకు చాచి చూపుడు వేలుతో గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న బాబాసాహెబ్‌ విగ్రహం నెక్లెస్‌ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం.. మరోవైపు అమరుల స్మారకం.. అంబేడ్కర్‌ భారీ విగ్రహం.. హైదరాబాద్ కు మణిహారంగా నిలవనున్నాయి