హైదరాబాద్లో ఉగ్రవాద కలకలం-16 మంది అరెస్టు
హైదరాబాద్లో 16 మంది టెర్రరిస్టులను అరెస్టు చేశారు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్. హైదరాబాద్లో ఉగ్రవాద కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ రోజు ఉదయం నుండి పట్టణంలో పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్, తెలంగాణా పోలీసుల జాయింట్ ఆపరేషన్లో చేపట్టి, 16 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిలో 11 మంది మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన వారు కాగా 5 గురు హైదరాబాద్కు చెందినవారు. వారినుండి మొబైల్ ఫోన్లు, కత్తులు,ల్యాప్ట్యాప్లు, ఇస్లామిక్ జీహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఐదుమందిని కూడా భోపాల్కు తీసుకువెళ్లారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.