Home Page SliderTelangana

తెలంగాణాలో పదోతరగతి హాల్ టికెట్లు జారీ

Share with

తెలంగాణాలో పరీక్షల సీజన్ జోరందుకుంది. ఇప్పటికే ఇంటర్‌మీడియట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 3 నుండి 13 వరకు జరగబోయే టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిపై స్కూల్ హెడ్‌మాస్టర్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈసారి 4.94 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయబోతున్నారు. ఈ పరీక్షల కోసం 2,652 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.