ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కాగా ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను తాజాగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ముందుగానే పరీక్షలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 18 నుంచి 30 వరకు రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి.కాగా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యహ్నం 12.45 గంటల వరకు ఒక్కో పరీక్ష జరగనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు.అయితే రాష్ట్రంలోని మొత్తం 6 లక్షలమంది టెన్త్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని మంత్రి బొత్స అన్నారు. ఈ మేరకు ఏపీలోని టెన్త్ విద్యార్థులంతా పరీక్షలకు సన్నద్దమవ్వాలని విద్యాశాఖమంత్రి సూచించారు.అయితే త్వరలోనే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటిస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.