Home Page SliderTelangana

CA ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థి

Share with

తాజాగా విడుదలైన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్ ఫలితాల్లో తెలుగు విద్యార్థి సత్తా చాటాడు. కాగా హైదరాబాద్‌కు చెందిన వై.గోకుల్‌సాయి శ్రీకర్ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. అయితే నిన్న CA ఫైనల్,ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కాగా శ్రీకర్ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల.తండ్రి బ్యాంకు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ నిజాంపేట్‌లో స్థిరపడ్డారు. దీంతో శ్రీకర్ హైదరాబాద్‌లోనే ఇంటర్ ఎంఈసీ చదివాడు. ఆ తర్వాత సీఏ కోచింగ్ తీసుకున్నాడు. సీఏ పూర్తి చేయాలంటే మూడు స్థాయిల్లో నిర్వాహించే పరీక్షల్లో అర్హత సాధించాల్సివుంటుంది. అయితే అందులో మధ్యస్థాయి పరీక్షల్లో శ్రీకర్ 800 మార్కలకుగాను 688 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కాగా శ్రీకర్ మొదటి ప్రయత్నంలోనే సీఏ ఇంటర్‌లో గ్రూప్-1,2 పరీక్షలు రాసి విజయం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీకర్ మాట్లాడుతూ..మొదటి ప్రయత్నంలోనే ఫస్ట్ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఫైనాన్స్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తన లక్ష్యమని శ్రీకర్ వెల్లడించారు.