Home Page SliderTelangana

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడాలి-సీఎం రేవంత్ రెడ్డి

Share with

సీఐఐ ఆధ్వర్యంలో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక అవకాశాలు’ అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారన్నారు. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తామన్నారు. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇస్తామన్నారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామన్న రేవంత్… గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని, ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందన్నారు.