NewsTelangana

పండుగచేస్కోమంటున్న తెలంగాణా సర్కార్

Share with

తెలంగాణా సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అది ఏటంటే స్కూల్‌కు వెళ్లే పిల్లలందరూ..ఎప్పడెప్పుడా అని ఎదురుచూసే దసరా సెలవులు. ఈ సెలవుల కోసం రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఎదురుచూస్తూనే ఉంటారు. మరి దసరా పండుగ దగ్గర పడుతుండడంతో విద్యార్థులకు వీటిపై ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణా సర్కార్ సెలవులను ప్రకటించేంది. తెలంగాణా సర్కార్ సుమారు 15 రోజులపాటు ఈ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు సెలవులు ప్రకటించింది. అదే విధంగా వచ్చే నెల 10 నుంచి స్కూళ్లను తెరవాలని తెలంగాణా సర్కార్ విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ ఈ ఆదేశాలు పాటించాలని సర్కార్ స్పష్టం చేసింది.