తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధర్నా..
హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు నేడు ధర్నా చేయనున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ధర్నా చేయాల్సిన విచిత్రపరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. విషయమేంటంటే పార్లమెంట్లో స్మోక్ బాంబు ఘటన సందర్భంలో పలువురు విపక్ష ఎంపీలు ఆందోళనలు చేయడంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. 144 మందికి పైగా విపక్ష నేతలు సస్పెన్షన్కు గురి కావడంతో ఇండియా కూటమికి చెందిన నేతలు దేశవ్యాప్తంగా పలు నగరాలలో ధర్నాలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు కలిసి, నిరసనలు చేయనున్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఈ ధర్నాలో పాల్గొననున్నారు.