Home Page SliderInternational

అదరగొట్టిన టీమిండియా అమ్మాయిలు-సౌతాఫ్రికాతో టెస్టులో ఘనవిజయం

Share with

సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని సాధించింది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా విజృంభించి తొలి ఇన్నింగ్స్‌లో 8, రెండవ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయడంతో మొత్తం  10 వికెట్లు తీసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 6 వికెట్లకు 603పరుగులు సాధించి డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇచ్చిన 37 రన్స్ టార్గెట్‌ను ఓపెనర్లుగా దిగిన షెఫాలి,శుభా సతీశ్ కొట్టేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో షెఫాలీ వర్మ 205, స్మృతిమంధాన 149 పరుగులు సాధించారు. దక్షిణాఫ్రికా 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది.  రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు స్నేహ్ రాణా 2, దీప్తి శర్మ 2, రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు తీశారు.