Home Page SliderNational

ముంబయిలో ప్రారంభమైన టీమిండియా విక్టరీ పరేడ్

Share with

భారతదేశానికి T20 ప్రపంచకప్‌ను గెలిచి టీమిండియా ఆకాశమంత విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో స్వదేశానికి వచ్చిన రోహిత్ సేనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా ప్రస్తుతం ముంబయిలోని నారిమన్ పాయింట్ నుంచి టీమిండియా విక్టరీ పరేడ్ ప్రారంభమైంది. ఓపెన్ బస్‌లో ప్రారంభమైన ఈ ఉరేగింపు వాంఖడే స్టేడియం వరకు కొనసాగనుంది. కాగా ఈ రోడ్ షోలో క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సాహో టీమిండియా అంటూ నినాదాలు చేస్తున్నారు.దీంతో ముంబయి రోడ్లన్నీ క్రికెట్ అభిమానులతో కిక్కిరిసి పోయాయి.