తెలంగాణా నెం.1గా నిలవడానికి కారణం టీడీపీ
ఈ రోజు దేశంలో తెలంగాణా రాష్ట్రం నంబర్వన్గా నిలుస్తోందంటే దానికి కారణం టీడీపీ వేసిన పునాదే అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగున టీడీపీ ముద్ర ఉందన్నారు. టీడీపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం పనిచేస్తోందని చంద్రబాబు వెల్లడించారు. కాగా ప్రతి తెలుగు వాడిని సంపన్నుడిగా చేయడమే టీడీపీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100% టీడీపీయే అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.