లోకేష్ వల్లే టీడీపీ సర్వనాశనమైంది:అంబటి
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ..లోకేష్ వల్లే టీడీపీ పార్టీ సర్వనాశనమయ్యింది అన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు.ఏపీలో తండ్రి,కొడుకులు ఇద్దరూ వేల కోట్లు దోచుకున్నారని అంబటి ఆరోపించారు.కాగా మాకు కక్ష సాధింపు చర్యలు చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. బాబు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ చేశారని ఆధారాలు ఉన్నాయి.కాబట్టే ఆయనను సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. కాగా ఏపీలో టీడీపీని కాపాడటం ఎవరి తరం కాదని అంబటి తెలిపారు. అసలు టీడీపీకి ఏ బలం ఉందని పవన్ కళ్యాణ్ ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పెళ్లికి పిల్లిని వెంట బెట్టుకుని వెళ్తారా అని మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ను ఎద్దేవా చేశారు.మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ను సీఐడీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు.