కేవలం 25 ఓట్లతో గెలిచిన టీడీపీ అభ్యర్థి
ఏపీ ఎన్నికల ఫలితాలలో ఒక విచిత్రం జరిగింది. వేల ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు గెలుపు సాధిస్తుంటే ప్రతీ ఓటుకీ విలువ ఉందని నిరూపించారు మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్.రాజు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో తన సమీప వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పపై కేవలం 25 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు ఎం.ఎస్. రాజు.