NationalNews Alert

ఉద్యోగులకు టీసీఎస్ కీలక ఆదేశాలు

Share with

కరోనా కారణంగా అన్ని IT సంస్థలు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే కరోనా తీవ్రత తగ్గడంతో వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని అన్నీ సంస్థలు తొలగిస్తూ..వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చాయి. కానీ కొంతమంది అనారోగ్య సమస్యల కారణంగా ఇంకా వర్క్ ఫ్రం హోంను కొనసాగిస్తున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని TCS కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుండి పని చేయాల్సి వస్తే.. ఆయా వ్యక్తులు కంపెనీ అంతర్గత వైద్యుల నిర్ధారణ అవసరమని వెల్లడించింది. అటువంటి ఉద్యోగులు వారి రోగ నిర్ధారణలు, చికిత్సలు, ధృవీకరణ పత్రాలను కంపెనీ-ప్యానెల్ మెడికల్ కమిటీ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.