గృహనిర్భందంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహనిర్భందం చేశారు. కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమంగా పంటల బీమా పొందారని ఆరోపించారు. అంతేకాకుండా ఈ రోజు కేతిరెడ్డి తోటకు వెళ్తానని ఆయన ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్తగా జేసీని గృహనిర్భందం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ఆయన ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు.