కామారెడ్డి జిల్లా బీసీ హస్టల్లో విద్యార్థి అనుమానాస్పదమృతి
కామారెడ్డి జిల్లా బిర్కూర్లో విషాదం చోటు చేసుకుంది. బిర్కూర్లోని బీసీ బాలుర హస్టల్లో సాయిరాజ్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాయిరాజ్ బీసీ బాలుర హస్టల్లో 5వ తరగతి చదువుతున్నాడు. అయితే హస్టల్ సిబ్బంది సాయిరాజ్ పాము కరవడం వల్లే చనిపోయాడని చెబుతున్నారు.ఈ రోజు ఉదయం 5 గంటలకు మృతి సాయిరాజ్ మృతి చెందాడు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/09/image-279.png)
దీంతో బీసీ హస్టల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాయిరాజ్ కుటుంబ సభ్యులు హస్టల్ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే హస్టల్ సిబ్బంది విద్యార్థి మృత దేహాన్ని పోస్ట్మార్టంకు పంపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ బీసీ హస్టల్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ హస్టల్ వార్డెన్ సందీప్ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా కలెక్టర్ బాలుడి మృతిపై ఉన్నత స్థాయి విచారణ చేయిస్తామని హామి ఇచ్చారు. కాగా వార్డెన్ నిర్లక్ష్యంతోనే సాయిరాజ్ చనిపోయినట్లు కలెక్టర్ తెలిపారు. సాయిరాజ్ను హాస్పిటల్కు తీసుకు వెళ్ళినా..అక్కడ ఇంజెక్షన్ చేయలేదని సాయిరాజ్ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా జ్వరం వచ్చిందని చెప్పి అంతలోనే చనిపోయాడని చెప్పారంటూ సాయిరాజ్ తల్లిదండ్రులు కన్నీరుమన్నీరౌతునన్నారు.