Andhra PradeshHome Page Slider

విశాఖ ఆర్కే బీచ్‌లో యువతి అనుమానాస్పద మృతి

Share with

విశాఖ ఆర్కే బీచ్‌లో దారుణం చోటుచేసుకుంది. బీచ్‌లో అర్థనగ్నంగా ఇసుకలో కూరుకుపోయిన యువతి మృతదేహం లభ్యమయ్యింది. నిన్న స్వాతి అనే గాజువాక నడిపూరుకు చెందిన యువతి మిస్సింగ్ కంప్లైంటు వచ్చింది. దీనితో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు జరుగుతుండగానే ఈరోజు ఆర్కే బీచ్‌లో యువతి మృతదేహం లభ్యమయ్యింది. ఆమెను స్వాతిగా గుర్తుపట్టారు. ఆమెకు ఏడాది క్రితమే వివాహమయ్యిందని, ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి కూడా అని సమాచారం. భర్త హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య విబేధాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆమెది హత్యా.. ఆత్మహత్యా అనేది అనుమానాస్ఫదంగా ఉంది. మిస్సింగుకు ముందుగా భర్త ఫోన్ చేసి మందలించారని తెలుస్తోంది. దీనితో నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో కోపంతో  బయటకు వచ్చిందని తెలిపారు. ఆమె సముద్రంలో ఆత్మహత్య చేసుకుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చిన విధానం, ఆమె దుస్తులతీరు చూస్తే హత్యా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజిలు, బందువులు, తల్లిదండ్రుల మాటల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.