ఉత్కంఠకు తెర
హైదరాబాద్-గచ్చిబౌలి: శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి ఎంపికకు తెరదించిన అధిష్టానం. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్కు పిలుపు వచ్చింది. ఈ మేరకు ఆయనకు టిక్కెట్ ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం ఫోన్ చేసి తెలిపింది. దీంతో మసీదు బండలోని బీజేపీ కార్యాలయం, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ నివాసంలో కార్యకర్తలు, నాయకులతో సందడి వాతావరణం నెలకొంది. శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ యాదవ్ ఎన్నికల రంగంలోకి దిగారు.