ఏపీలో సబ్సిడీ టమాటాలు..ఎగబడ్డ ప్రజలు
దేశంలో గతకొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. దీంతో టమాటాలు కొనాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు.కాగా ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధర రూ.200 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ధరకే టమాటాలు అందిస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం కూడా రైతు బజార్లలో రూ.50కే కిలో టమాటాలు అందిస్తుంది. కాగా ఈ టమాటాల కోసం ప్రజలు రైతు బజార్లకు పోటెత్తుతున్నారు. తాజాగా ఈ టమాటాల కోసం కర్నూల్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. దీంతో గంటల వ్యవధిలోనే 3టన్నుల టమాటా అమ్ముడైపోయింది. కాగా నిన్న విజయవాడ, గుంటూరు, ఈ రోజు ఆదోనిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే నాలుగైదు రోజుల తర్వాత సబ్సిడీ టమాటాలు రావడంతో ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు చెబుతున్నారు.