Andhra PradeshNews Alert

క్లాస్ రూమ్‌లో కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్ధులు

Share with

కాకినాడ జిల్లాలోని వనసపాకలలోని కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు క్లాస్ జరుగుతుండగా మధ్యలో కల్లు తిరిగి పడిపోయారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఈ విధంగా కళ్లు తిరిగి పడిపోగా వారిని వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. పడిపోయునా విద్యార్థులంతా ఐదు , ఆరు తరగతికి చెందిన వారిగా గుర్తించినట్టు తెలిసింది. అయితే స్కూలు పక్కనే ఉన్న ఫ్యాక్టరీ కారణంగా విషవాయువులు వెలువడం వల్ల.. పిల్లలకు ఊపిరి ఆడటం లేదని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.