Home Page SliderTelangana

నాగర్ కర్నూల్‌లో వీధి కుక్కల హల్‌చల్

Share with

తెలంగాణాలో ఈ మధ్య కాలంలో వీధి కుక్కల దాడిలో పలువురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీటిపై అప్పటికప్పుడు స్పందించే ప్రభుత్వం వాటిని ఏమాత్రం అరికట్టలేకపోతుంది. దీంతో తెలంగాణాలో తరచుగా పిల్లలపై వీధి కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగర్ కర్నూల్ ఎర్రగడ్డ కాలనీలో వీధి కుక్కలు ఓ బాలుడిపై దారుణంగా దాడి చేశాయి. అయితే మొత్తం 4 వీధికుక్కలు బాలుడిపై ఎగబడి తీవ్రంగా కరిచాయి. ఈ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని హస్పటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెప్తున్నారు. వాటిని నియంత్రణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.