Home Page SliderNational

కరుణానిధి శతజయంతి సభలో విచిత్ర సంఘటన

Share with

‘ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారు’ కొందరు. ఇక అరటి గెలలు వదులుతారా? తమిళనాడులోని నాగపట్నంలో ఓ వింత జరిగింది. అక్కడ కరుణానిధి శతజయంతి వేడుకలు చేశారు అభిమానులు. దీనికి కరుణానిధి కుమారుడు ఉదయనిధిని అతిధిగా  ఆహ్వానించారు. ఆయనకు స్వాగత తోరణాలుగా గెలలతో ఉన్న అరటి చెట్లు 400 రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఉదయనిధి ఓ పక్క మాట్లాడుతుంటే సభకు వచ్చిన వారు అందినవి అందినట్లే అరటి గెలలు ఎత్తుకు పోయారు. ఈ విషయంలో ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా కత్తులు, కొడవళ్లు తెచ్చి మరీ తెంపుకు పోయారు. ఈ సంగతి తెలిసిన పార్టీ పెద్దలు అవాక్కయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతున్నాయి.