తొలిసారి టీ20 ఫైనల్కు దక్షిణాఫ్రికా
ట్రినిడాడ్ వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా సంచలన విజయం నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో తొలిసారిగా ఫైనల్కు దూసుకుపోయింది. ఆఫ్గాన్ సేన దిగ్గజ ఆస్ట్రేలియానే ఓడించి సెమీస్కు చేరిన విషయం తెలిసిందే. అయితే సౌతాఫ్రికాపై మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 11.5 ఓవర్లలోనే కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాట్స్మెన్ అందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఒమర్జాయ్ 10 పరుగుల వరకూ వచ్చినా నోకియా బౌలింగ్లో స్టబ్స్కు అనుకోని విధంగా క్యాచ్ ఇచ్చి చేతులెత్తేశాడు. సౌతాఫ్రికా బౌలర్లు చురుకుగా ఆడుతూ ఆఫ్గాన్ను కుప్పకూల్చారు. కాగా భారత్ -ఇంగ్లాండ్ సెమీఫైనల్ నేడు సాయంత్రం జరగనుంది. గెలిచిన జట్టు శనివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడనుంది.