స్మృతి మంధాన సరికొత్త రికార్డు
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సరికొత్త రికార్డు సృష్టించారు. కాగా నేడు భారత మహిళా క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్తో మూడో టీ-20 మ్యాచ్లో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్తో స్మృతి మంధాన 200 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను ఆడారు. కాగా భారత్ తరపున ఇప్పటి వరకు మిథాలీ రాజ్ 333 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత జులన్ గోస్వామి 284 మ్యాచ్లతో రెండో స్థానంలో,హర్మన్ ప్రీత్ కౌర్ 281మ్యాచ్లు ఆడి 3 స్థానంలో కొనసాగుతున్నారు. అయితే స్మృతి మంధాన ఇవాళ జరుగుతున్న మ్యాచ్తో 200 మ్యాచ్లను పూర్తి చేసి 4 వ స్థానంలో ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు స్మృతి మంధానకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.