Home Page SliderNational

హాథ్రస్ ఘటనలో ఆరుగురు అరెస్టు

Share with

హాథ్రస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ తొక్కిసలాటలో 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. హాథ్రస్ జిల్లాలోని రతిభాన్ పూర్‌లో నిర్వహించిన ఈ సత్సంగ్ కార్యక్రమంలో 80 వేల మందికి అనుమతి తీసుకోగా, 2.50 లక్షల మంది వచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో భోలేబాబా వెళ్లిపోయే సమయంలో పాదధూళి కోసం తొక్కిసలాట జరిగినట్లు గుర్తించారు. ఇంత జరిగినా కొందరు అమాయక భక్తులు బాబానే సపోర్టు చేస్తూ మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.