Home Page SliderNational

ప్రభుత్వ ఉద్యోగులకు సిక్కిం సర్కార్ గుడ్‌న్యూస్

Share with

సిక్కిం సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. అదేంటంటే సిక్కిం రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ  మహిళ ఉద్యోగులకు ఓ ఏడాదిపాటు మాతృత్వపు సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా పురుష ఉద్యోగులకు నెలరోజులపాటు పితృత్వ సెలవులను ఇస్తున్నట్లు సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు. ఈ మేరకు ప్రయోజనం కలిగించేందుకు సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను మంచిగా చూసుకోవడానికి ఉపయోగపడుతుందని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల సిక్కిం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.