Home Page SliderTelangana

అస్వస్థతకు గురైన పాఠశాల విద్యార్థినులు

Share with

తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ జిల్లా నస్కల్‌లో కస్తూర్బా పాఠశాలలో 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. రాత్రి భోజనంలోకి విద్యార్థినులకు పప్పు, అన్నం, ఆలు కర్రీ వడ్డించారు. ఆహారం తిన్న అనంతరం విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులతో విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. వీరిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.