Home Page SliderNational

షూటింగ్ పూర్తి చేసుకున్న “ఖుషీ” మూవీ

Share with

శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ,హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం “ఖుషీ”. అయితే ఈ సినిమా తాజాగా షూటింగ్‌ను పూర్తిచేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని  తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఖుషీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు.  అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన “నా రోజా నువ్వే”, “ఆరాధ్య”సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి.