భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్పై భారీగా వరద నీరు నిలిచిపోయింది. అంతేకాక హసన్ పర్తి- కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్పై వరద నీరు ముంచెత్తుతోంది. దీనితో ట్రాక్ను గమనించి రైళ్లను నడపడం కుదరని పని. అందుకే ఈ మార్గంలో ప్రయాణికుల రక్షణార్థం రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 9 రైళ్లను దారి మళ్లించారు. సిర్ఫూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేశారు. తిరుపతి- కరీంనగర్, సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేశారు.
రద్దయిన రైళ్లు —
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-138.png)
పాక్షికంగా రద్దయిన రైళ్లు—
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-139.png)
దారి మళ్లించిన రైళ్లు–
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-140.png)